VSP: విశాఖ జీవీఎంసీ ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న ‘ఆపరేషన్ లంగ్స్ 2.0’ ఆక్రమణల తొలగింపు డ్రైవ్కు దసరా పండుగ సందర్భంగా తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఏ. ప్రభాకర రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విరామ సమయంలో ఆక్రమణదారులు స్వయంగా తమ దుకాణాలు, బడ్డీలు తొలగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.