MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో బుధవారం ఉదయం ప్రధానార్చకులు శంకర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి సౌమ్యవాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం శుక్లపక్షం అష్టమి తిథి పురస్కరించుకొని దుర్గమ్మకు పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.