ప్రకాశం: జిల్లాలోని అన్ని పాఠశాలలకు బుధవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మోంథా తుఫాను, భారీ వర్షాల దృష్ట్యా డిజాస్టర్ సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఏ ప్రైవేటు పాఠశాల కూడా అదనపు తరగతుల పేరుతో ఎటువంటి తరగతులు నిర్వహించరాదన్నారు. ఆదేశాలను పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.