AP: తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 64065 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, 25250 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.57 కోట్లుగా నమోదైంది.