VSP: జీవీఎంసీ 95వ వార్డు పురుషోత్తపురం నియర్ బాలాజీ నగర్లో జీవీఎంసీ నిధులు రూ.39.40 లక్షలతో తారురోడ్డు పనులను ఇవాళ కార్పొరేటర్ ముమ్మన దేముడు పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ముమ్మన మాట్లాడుతూ.. నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు.