BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామానికి చెందిన హిందూ పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు విద్యా పర్యటనలో భాగంగా నగరవనం పార్క్, కొండవీడు కోటలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ.. నగరవనం పార్క్లోని పచ్చదనాన్ని, వన్యప్రాణులను దగ్గరగా చూసి ఆనందించారు. అనంతరం కొండవీడు కోటకు వెళ్లి చారిత్రక విశేషాలను తెలుసుకున్నారు.