సత్యసాయి: కదిరి రూరల్ మండలం మల్లయ్య గారి పల్లిలో శ్రీ శ్రీ రాములు స్వామి గుడి నిర్మాణం కోసం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ రూ.3,60,000 విరాళం అందజేశారు. ఎమ్మెల్యే సతీమణి కందికుంట యశోద దేవి చేతుల నుంచి గ్రామస్థులు ఈ మొత్తాన్ని అందుకున్నారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.