కోనసీమ: జాతీయ రహదారులపై వ్యతిరేక దిశ ప్రయాణం ప్రమాదకరమని, ఎక్కువ ప్రమాదాలు ఈ ప్రయాణంతోనే జరుగుతున్నాయని ఆలమూరు ఎస్సై జి. నరేష్ అన్నారు. ఆలమూరు మండలం జొన్నాడ సెంటర్ నుంచి మడికి సెంటర్ వరకు జాతీయ రహదారిపై వ్యతిరేక దిశలో ప్రయాణించే వాహనదారులకు అవగాహన కల్పించారు. అలాంటి వాహనాలపై అపరాధ రుసుం విధించారు.