GNTR: మొంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో, గుంటూరు నగరంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఆదివారం మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమీక్షలో అధికారులకు, కార్పొరేటర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా, క్షేత్ర స్థాయిలో అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు.