అన్నమయ్య: గాలివీడు(మం) గుండ్లచెరువు గ్రామ కస్పాలో రూ.31 లక్షల వ్యయంతో నిర్మించనున్న రామాలయానికి భూమి పూజ నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని పేర్కొన్నారు.