బాపట్ల: సంతమాగులూరు మండలం ఏల్చూరులోని చారిత్రాత్మక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (1942) శిథిలావస్థకు చేరడంతో, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 84 ఏళ్ల పాత భవనాల కూల్చివేత పూర్తయి, అత్యాధునిక వసతులతో కొత్త పాఠశాల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.