CTR: చిత్తూరులో నిర్వహించిన “వార్తలాప్” అవగాహన సదస్సులో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ పథకాలను గ్రామీణ ప్రజలకు చేరువ చేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.