KRNL: పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 18న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని MLA శ్యాంబాబు, స్కిల్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ బుధవారం తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకొని, 18 నుంచి 35 ఏళ్ల వయసున్నవారు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. 16 కంపెనీల ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొంటారన్నారు. జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు.