ప్రకాశం: ఒంగోలు నియోజకవర్గంలోని 42 మంది లబ్ధిదారులకు రూ. 35.60 లక్షలు విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మంగళవారం అందజేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.