ATP: జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర ఇంగ్లిష్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 22,800 మంది, ఒకేషనల్ విభాగంలో 2,469 మంది విద్యార్థులు హాజరైనట్లు RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. మొత్తం 810 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాకు విచ్చేసిన బోర్డు అబ్జర్వర్ సౌజన్య పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.