KDP: విభజన చట్టం ప్రకారం కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంత.. కానీ ఇచ్చింది మాత్రం గోరంత అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి అన్నారు. సోమవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం టీడీపీవై ఆధారపడి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనుగడ సాగిస్తూ ఉందన్నారు. కనీసం ఇప్పుడైనా రాష్ట్రానికి రావాల్సిన వాటిపై డిమాండ్ చేయాలన్నారు.