SKLM: జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం కోడి రామ్మూర్తి క్రీడామైదానంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రతి ఉద్యోగి పాల్గొని ఈ క్రీడలను విజయవంతం చేయాలని జిల్లా సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కె. శ్రీరాములు, బీవీవీఎన్ రాజులు కోరారు.