కృష్ణా: కార్తీక వన సమారాధన ప్రకృతి ఆరాధన ప్రాముఖ్యత గుర్తు చేస్తుందని MLA మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం అవనిగడ్డ మండలం పులిగడ్డలోని జలవనరుల శాఖ అతిధి గృహంలో కార్తీక వన సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా MLA విచ్చేసి ఉసిరి చెట్లకు పూజలు చేశారు. ఇరిగేషన్ SE R. మోహనరావుతో కలిసి వన భోజనం చేశారు.