SKLM: లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 8 పశువులను ఎస్సై కె. అప్పలసూరి గురువారం పట్టుకున్నారు. నరసన్నపేట మండలం తిలారు సంత నుంచి అలమండకు తరలిస్తున్న పవన్పై కేసు నమోదు చేసి, వ్యాను సీజ్ చేశామన్నారు. మూగజీవాలను అక్రమంగా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్సై అప్పలసూరి హెచ్చరించారు.