GNTR: నగరంలో గురువారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటించనున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ, ఎస్పీ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. డీజీపీ పర్యటన సందర్భంగా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.