ప్రకాశం: మార్కాపురంలో రేపు జరగబోయే సీఎం బహిరంగ సభకు సంబంధించి సిద్ధం చేసిన హెలిప్యాడ్ వద్ద మంగళవారం హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. నిర్ణయించిన ప్రదేశంలో హెలికాప్టర్ దిగి కొద్దిసేపు నిలిచి, భద్రతా ఏర్పాట్లు,ల్యాండింగ్ సౌకర్యాలను అధికారులు పరిశీలించారు. ఈ ట్రయల్ రన్ ద్వారా హెలిప్యాడ్ సౌకర్యాలు, భద్రతా చర్యలు సక్రమంగా ఉన్నాయా అని అధికారులు ధ్రువీకరించారు.