తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఈట్ స్ట్రీట్ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, కమిషనర్ ఎన్. మౌర్య నిన్న ప్రారంభించారు. రూ.1.63 కోట్లతో 14 కంటైనర్లలో ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ స్ట్రీట్లో నాణ్యమైన ఆహారం 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. మే 1 నుంచి అన్ని దుకాణాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి.