E.G: తడి చెత్తను ఇంటి వద్దే సహజ ఎరువుగా మార్చి పర్యావరణాన్ని కాపాడాలని అదనపు కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ సూచించారు. ఇవాళ రాజమండ్రిలో రిసోర్స్ పర్సన్లకు శిక్షణ నిర్వహించారు. ఈ క్రమంలో 269 మందికి రూ. 3,000 విలువైన హోం కంపోస్టింగ్ కిట్లు పంపిణీ చేశారు. చెత్త తగ్గింపు, స్వచ్ఛమైన పరిసరాలు, సహజ ఎరువు వినియోగం ప్రధాన లక్ష్యం అన్నారు.