ATP: రాయదుర్గం నియోజకవర్గంలోని 13 చెరువులు, కుంటల ఆధునీకరణకు ప్రభుత్వం రూ.2.45 కోట్లు మంజూరు చేసింది. కట్టలు, తూముల మరమ్మతులు చేపట్టి, వర్షపు నీటిని నిల్వ చేయడమే దీని లక్ష్యం. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. దీనివల్ల సాగునీటి లభ్యత పెరగడంతో పాటు భూగర్భ జలాలు వృద్ధి చెంది రైతులకు మేలు జరుగుతుంది.