NLR: కోవూరు నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శుక్రవారం కలిశారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లివాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.