NLR: పొదలకూరు జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో సోమవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించనున్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9వ విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉదయం 9 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.