KKD: కోరుకొండలో శ్రీ సీతారాముల ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని సీతారాముల వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సీతారాముల వారి ఆశీస్సులతో ప్రజల సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.