PLD: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో అదనపు ఎస్పీ జేవీ సంతోష్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలను వేగంగా, చట్టబద్ధంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక, కుటుంబ, మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలు వంటి వివిధ అంశాలపై మొత్తం 95 ఫిర్యాదులు అందాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు.