GNTR: హిందూపురం నుంచి రాజధాని అమరావతి వరకు “ఒక్క అడుగు బాధ్యత వైపు” అనే లక్ష్యంతో మంజునాథ్ చేపట్టిన సైకిల్ యాత్ర శుక్రవారం గుంటూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా సైకిల్ యాత్రికుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాధ్యతను గుర్తు చేస్తూ మంజునాథ్ చేపట్టిన ఈ యాత్ర అభినందనీయం అని అన్నారు.