KRNL: కర్నూలు మున్సిపల్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఈనెల 10న జూనియర్ మహిళల హాకీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ హాకీ కోర్ కమిటీ సభ్యులు దాసరి సుధీర్ తెలిపారు. 2007 జనవరి 1 తర్వాత జన్మించిన వారు ఈ పోటీలకు అర్హులని పేర్కొన్నారు. ఇక్కడ ప్రతిభకనబరిచిన క్రీడాకారులు ఈనెల 16 నుంచి 18 వరకు చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.