KNR: జమ్మికుంట పట్టణం కేశవపురం 15వ వార్డుకి చెందిన పాతకాల ప్రశాంత్ జాతీయ స్థాయి రోయింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఏప్రిల్ 8 నుంచి 12 వరకు ఒడిశాలోని కటక్ నగరంలో నిర్వహించనున్న ఫస్ట్ ఆల్ ఇండియా ఇండోర్ రోయింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొననున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో SPF కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ పలు పథకాలు సాధించాడు