శ్రీకాకుళం: పట్టణ పరిధిలోని డీఈవో కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం ముట్టడి కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవల 10 తరగతి పబ్లిక్ పరీక్షలలో సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులు, డిబార్ అయిన విద్యార్థులకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డీఈఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు.