ప్రకాశం: మార్కాపురం మండలం మాల్యవంతునిపాడు గ్రామంలో కుక్కలు బెడదతో గ్రామస్తులు భయం భయంతో జీవిస్తున్నారు. సోమవారం రాత్రి ఇద్దరు మహిళలను వెంటపడి మరీ కరిచాయి. ఎస్సీ పాలెంలో సుమారు 40 కుక్కలకు పైగా వీధుల్లో తిరుగుతూ నిత్యం పొలాలకు వెళ్లే వారిని, వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు స్పందించి కుక్కలను తీసుకువెళ్లాలని కోరారు.