కర్నూలు జిల్లా ఎదురూరు గ్రామం వద్ద ఇవాళ ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఆర్.కొంతలపాడు గ్రామానికి చెందిన కురువ పరుశరాముడు(24) నడుచుకుంటూ వెళ్తుండగా కర్నూలు రెండో డిపోకు చెందిన బస్సు ఢీకొట్టడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.