కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి, 2026-27 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో పచ్చదనాన్ని పెంచేందుకు విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో, జిల్లా వ్యాప్తంగా 45 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని, జాతీయ రహదారులు, ఆర్&బీ రహదారుల వెంట మొక్కలు నాటి, వాటిని సంరక్షించే చర్యలు తీసుకోవాలన్నారు.