CTR: కొబ్బరికాయలు కోయడానికి చెట్టు ఎక్కిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన శుక్రవారం రామకుప్పం మండలంలో జరిగింది. సింగసముద్రం పంచాయతీ చింతమానత్తం గ్రామానికి చెందిన శంకరప్ప(50) బంధువుల కోసం తమ పొలంలోని కొబ్బరిచెట్టు ఎక్కాడు. ఈక్రమంలో శంకరప్ప ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు.