BPT: చందోలులో శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. జీర్ణోద్ధరణ చేసిన నూతన మండపంలో అర్చకులు ఆగమ శాస్త్రం ప్రకారం వివాహ వేడుకను నిర్వహించారు. నిత్య హోమం, ప్రత్యేక పూజలతో పాటు గరుడసేవ, రథోత్సవం కనులపండువగా సాగాయి. భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఛైర్మన్ సాయి గుప్తా, ఈఓ నరసింహమూర్తి వెల్లడించారు.