ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం వావిలాల శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరు గొల్లపూడి గ్రామానికి, మరొకరు అడసర్లపాడు గ్రామానికి చెందినవారిగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.