TG: ‘పేదల భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకోం’ అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న పట్టా భూములను కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. భూ బాధితుల ధర్నాకు మద్దతు పలికిన ఆయన, పేదల హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.