KNR: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇప్పల నర్సింగాపూర్కు చెందిన పల్లె రవి అనే గీత కార్మికుడు తాటి చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. రోజువారి విధుల్లో భాగంగా చెట్టు ఎక్కిన రవి దిగే సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. సహచరులు వెంటనే గమనించి 108 అంబులెన్స్ ద్వారా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వరంగల్కు తరలించారు.