ATP: గుంతకల్లు శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం ఆర్డీవో శ్రీనివాస్ అధ్యక్షతన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో హనుమత్ వ్రతంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయ ఈవో విజయ రాజు, ఆర్డీవో శ్రీనివాసులు మాట్లాడుతూ.. డిసెంబర్ 3న జరిగే హనుమత్ వ్రతానికి వచ్చే భక్తాదులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.