GNTR: తాడికొండలోని లాం జెడ్.పి. ఉన్నత పాఠశాలలో 9,10వ తరగతి విద్యార్థులకు ఐసీడీఎస్ సీడీపీవో అనురాధ పౌష్టికాహారం, రక్తహీనతపై సోమవారం అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ శక్తి సంకల్పం కార్యక్రమంలో భాగంగా ఫిరంగిపురం ప్రాజెక్టు సీడీపీవో ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య గురించి వివరించారు.