SKLM: నరసన్నపేటలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలోగా వైసీపీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని వైసీపీ నేత, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. సోమవారం నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో కమిటీ డిజిటలైజేషన్ కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే వైసీపీ బలోపేతం కోసం కమిటీలను ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు.