NGKL: మంత్రి జూపల్లి కృష్ణారావు వైఖరిని నిరసిస్తూ కొల్లాపూర్లోని ఎంపీడీవో కార్యాలయం ముందు సర్పంచులు ధర్నా నిర్వహించారు. తమకు కనీస గౌరవం ఇవ్వకుండా అధికారులు, మంత్రి వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. గ్రామాల్లోకి మంత్రి రావాలంటే సర్పంచుల అనుమతి ఉండాలని డిమాండ్ చేశారు. తమపై చూపుతున్న వివక్షను వీడకుంటే రాబోయే రోజుల్లో ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు.