KNR: అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 27వ తేదీన సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కళ్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పరిశీలించారు.