MBNR: నగరంలోని శిల్పారామంలో “మినీ సరస్ మేళా”ను ఇవాళ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ప్రారంభించారు. నాబార్డ్, గ్రామాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఈ మేళాను ఏర్పాటు చేశారు. ఈ నెల 29 వరకు జరిగే ఈ ప్రదర్శనలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు.