NRPT: మక్తల్ మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని సోమవారం మున్సిపల్ కమిషనర్ శ్రీరాములను మర్యాదపూర్వకంగా కలిశారు. వార్డులో జరగాల్సిన అభివృద్ధి పనులు, వాటికి కావాల్సిన నిధులపై చర్చించారు. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో ఇప్పటికే అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, మరిన్ని పనుల మంజూరు కోసమే కమిషనరు కలిసినట్లు ఆమె తెలిపారు.