SKLM: ఆధునిక సాంకేతికత ద్వారా రైతుల అభివృద్ధి సాధ్యం అని జిల్లా పరిషత్ ముఖ్య అధికారి ఆర్. వెంకటరమణ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెండవ రోజు ఉత్తరకొస్తా మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికత జోడించడం ద్వారానే రైతులు అభివృద్ధి సాధిస్తారని అన్నారు.