అన్నమయ్య: పరిశ్రమల పేరుతో దళితుల భూములు సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు పేదల భూముల జోలికి వస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. గ్రామసభ తీర్మానం లేకుండా భూసేకరణ నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.