TPT: రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీస్, అగ్నిమాపక, ట్రాన్స్ పోర్ట్ సంబంధించిన అధికారులు జాయింట్ ఆపరేషన్ నిన్న నిర్వహించారు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయులు ఆధ్వర్యంలో చెన్నై-తిరుపతి, తిరుపతి-విజయవాడ జాతీయ రహదారులపై ఉన్న ఏర్పేడు, వడమాల పేట టోల్ ప్లాజా ప్రాంతాల్లోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, సుదూర ప్రాంతాలకు పయనిస్తున్న వారి వాహనాలను తనిఖీ చేశారు.